Current Date: 05 Oct, 2024

రేపు తిరుపతి జిల్లా కు సీఎం చంద్రబాబు

ఏపీ సీఎం చంద్రబాబు సోమవారం తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలోని శ్రీసిటీలో పర్యటించన్నారు. ఈసందర్భంగా ఆయన వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. శ్రీసిటీలో 15 సంస్థల కార్యకలాపాలు ప్రారంభించడంతో పాటు మరో 7 సంస్థలకు శంకుస్థాపన చేస్తారు. శ్రీసిటీలో రూ.900కోట్ల పెట్టుబడితో 2,740 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. మరో రూ.1,213కోట్ల పెట్టుబడులకు ప్రభుత్వం ఒప్పందాలు చేసుకోనుంది.పలు కంపెనీల సీఈఓలతో భేటీ అనంతరం నెల్లూరు సోమశిల సాగునీటి ప్రాజెక్ట్ ను సీఎం సందర్శిస్తారు.

Share