Current Date: 05 Oct, 2024

చెల్లి ఇంటికి వెళ్లాలన్న భార్య బైక్‌‌కి కట్టి ఊరంతా ఈడ్చిన భర్త

తోడబుట్టిన చెల్లిని చూడాలని ఉంది.ఆమె ఇంటికి వెళ్తానని భర్తను అడిగిన భార్యను మద్యం మత్తులో కిరాతకంగా హింసించాడు భర్త. ఆమె కాళ్లను బైక్ వెనుక కట్టి గ్రామంలోని మట్టిరోడ్డుపై ఈడ్చుకొంటూ వెళ్లాడు. స్థానికులు చూస్తూ నిల్చొన్నారు తప్ప.. అడ్డుచెప్పలేకపోయారు. ఈ దారుణ ఘటన రాజస్థాన్‌లోని నాగౌర్‌ జిల్లాలో చోటు చేసుకుంది. నాగౌర్‌కు చెందిన ప్రేమ్‌రామ్‌ మేఘ్‌వాల్‌ భార్య జైసల్మేర్‌లో ఉంటున్న తన సోదరి ఇంటికి వెళ్లాలనుకుంది. కానీ భర్త అందుకు నిరాకరించడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ప్రేమ్‌రామ్‌ మద్యం తాగి, భార్యపై దాడి చేశాడు. ఆమె కాళ్లను ద్విచక్రవాహనం వెనుక కట్టి గ్రామంలోని మట్టిరోడ్డుపై ఈడ్చాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ కావడంతో.. పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. వీడియో ఆధారంగానే నిందితుడిని అరెస్టు చేశామని బాధితురాలు ప్రస్తుతం తన బంధువుల ఇంట్లో ఉంటోందని, ఈ ఘటనపై ఆమె ఇంతవరకూ ఫిర్యాదు చేయలేదని పోలీసులు తెలిపారు.

Share