Current Date: 02 Jul, 2024

టీమిండియా అభిమానులకు బ్యాడ్ న్యూస్

టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా ఆస్ట్రేలియాతో మరికాసేపట్లో ప్రారంభం కావాల్సిన గ్రూప్-1 సూపర్-8 మ్యాచ్‌కు భారీ అడ్డంకి ఏర్పడింది. ఈ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇస్తున్న సెయింట్ లూసియా నగరంలో భారీ వర్షం కురుస్తోంది. ఈ వర్షం ధాటికి మైదానం మొత్తం చిత్తడిగా మారిపోయింది. మైదానంలోకి భారీగా వర్షపు నీరు చేరింది.ఒకవేళ వర్షం ఆగినా.. ఆటకు మైదానాన్ని సిద్దం చేసేందుకు చాలా సమయం పట్టనుంది. ఈ మ్యాచ్ వర్షంతో రద్దయినా టీమిండియాకు వచ్చే నష్టం ఏం లేదు. ఇప్పటికే అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్‌లను ఓడించి రెండు విజయాలు నమోదు చేసిన టీమిండియా సెమీస్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ఒకవేళ ఈ మ్యాచ్ రద్దయినా గ్రూప్-1 టాపర్‌గా సెమీస్‌కు అర్హత సాధించనుంది.

Share