Current Date: 04 Jul, 2024

పాక్‌తో మ్యాచ్.. రోహిత్ శర్మ మతిమరుపుతో నవ్వులపాలు!

భారత కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్‌తోనే కాదు తన మతిమరుపుతో తోటి ఆటగాళ్లతో సరదాగా ఆట ఆడుకుంటుంటాడు. గతంలో ఎన్నోసార్లు ఇలాంటివి చేస్తూ కెమెరాకి చిక్కాడు. ఇటీవల ఐపీఎల్‌ 2024 సందర్భంగా కూడా కెమెరామెన్‌ను ఆడియో మ్యూట్‌ చేయమని, చేతులు జోడించి కోరుతూ నవ్వులు పూయించాడు. న్యూయార్క్ వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌ 2024లోనూ రోహిత్ శర్మ మళ్లీ కెమెరాకి చిక్కాడు.