Current Date: 05 Oct, 2024

ప్రభాస్ రెండు కోట్లు!

పాన్ ఇండియా హీరో ప్రభాస్ గొప్ప మనసు మరోసారి చాటుకున్నారు. వయనాడ్ బాధితుల కోసం రెండు కోట్ల విరాళం ప్రకటించారు. కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి రెండు కోట్ల రూపాయలు పంపించనున్నట్లు తెలిపారు.  ఇలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు ప్రతిసారి ప్రభాస్ స్పందిస్తూనే ఉన్నారు. ఈసారి భారీ విరాళం అందించనున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇంత పెద్ద మొత్తం ప్రకటించిన తొలి హీరో ప్రభాస్. మెగాస్టార్ చిరంజీవి తన కుమారుడు రామ్ చరణ్ కలసి కోటి రూపాయలు అందించిన విషయం తెలిసిందే! ప్రభాస్ అభిమానుల ఆనందానికి హద్దుల్లేకుండా పోయాయి. ఇండస్ట్రీ లో ప్రభాస్ నంబర్ వన్ అని చెప్పుకుంటున్నారు. విరాళం ప్రకారం చూసుకుంటే నంబర్ వన్, నో డౌట  ఇప్పటి వరకు తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి 3 కోట్ల 40 లక్షలు విరాళాలు కేరళకు లభించాయి! క్రెడిట్ మాత్రం రష్మిక కే చెందుతుంది. అందరికన్నా ముందు పది లక్షలు ఇచ్చి స్పందించిన పెద్ద మనసు రష్మిక వల్లే ఈ మాత్రం చలనం వచ్చిందని అనుకోవ  చ్చు. 

Share