Current Date: 05 Oct, 2024

టీటీడీ పరిపాలనా భవనంలో అగ్నిప్రమాదం

తిరుమల  తిరుపతి దేవస్థానం (టీటీడీ) పరిపాలనా భవనంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.  తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో పలు ఫైళ్లు దగ్ధమైనట్టు ప్రచారం జరుగుతోంది.

దీనిపై స్పష్టత రావాల్సి ఉంది.: అసిస్టెంట్ ఇంజినీర్ భాస్కర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.కాగా, అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోపే మంటలను టీటీడీ సిబ్బంది ఆర్పివేశారు. టీటీడీ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసులోని ఇంజినీరింగ్ విభాగంలో ఈ మంటలు చెలరేగాయి.ప్రమాదం జరిగిన సెక్షన్ ను చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అధికారి శ్రీధర్ పరిశీలించారు.

Share