Current Date: 07 Oct, 2024

నేటి నుంచి రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు

నేటి నుంచి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రెండు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్నారు. నిన్న సాయంత్రం ఆయన ఢిల్లీకి చేరుకున్నారు. ఇవాళ ఉదయం ప్రధాని మోదీతో చంద్రబాబు భేటీ కానున్నారు. మొదటగా వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో చంద్రబాబు భేటీ జరగనుంది. ఆ తరువాత 12.15 గంటలకు కేంద్రమంత్రి మంత్రి నితిన్ గడ్కరీ, 2 గంటలకు వ్యవసాయ, గ్రామాభివృద్ధిశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ 2.45 గంటలకు హోం మంత్రి అమిత్ షాతో చంద్రబాబు భేటీ కానున్నారు.

Share