Current Date: 04 Jul, 2024

పార్టీ ఎంపీలతో చంద్రబాబు భేటీ..

తెలుగుదేశం పార్టీ ఎంపీలను పార్టీ చీఫ్ చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసానికి ఆహ్వానించారు. ఈ రోజు  మధ్యాహ్నం పార్టీ ఎంపీలతో భేటీకి ఏర్పాట్లు చేశారు. ఢిల్లీలో జరిగిన ఎన్డీఏ భేటీ తర్వాత ఏపీకి తిరిగి వచ్చిన చంద్రబాబు.. పార్టీ ఎంపీలతో గురువారం భేటీ ఏర్పాటు చేశారు. దీనిపై అందరికీ సమాచారం పంపించారు. శుక్రవారం ఢిల్లీలో మరోమారు జరగనున్న ఎన్డీఏ కూటమి భేటీలో చంద్రబాబు టీడీపీ ఎంపీలతో కలిసి పాల్గొంటారు. ఈ నేపథ్యంలోనే పార్టీ ఎంపీలతో గురువారం తన నివాసంలో భేటీ ఏర్పాటు చేశారు.