Current Date: 06 Oct, 2024

డబుల్ ఇస్మార్ట్‌తో పూరీ కష్టాలు డబుల్ ఇప్పుడెలా?

టాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడికి కాలం కలిసొస్తున్నట్లు లేదు. లైగర్ డిజాస్టర్ తర్వాత రామ్‌‌ను హీరోగా పెట్టి తీసిన డబుల్‌ ఇస్మార్ట్‌ బాక్సాఫీస్‌ వద్ద మరో డిజాస్టర్‌గా మిగిలిపోయింది. 2019లో వచ్చిన ఇస్మార్ట్‌ శంకర్ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.లైగర్ డిజాస్టర్ తర్వాత పూరీపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. అతనితో సినిమాలు చేసేందుకు హీరోలు వెనుకంజ వేశారు. దాంతో తన సక్సెస్ ఫార్ములాని నమ్ముకుని డబుల్ ఇస్మార్ట్ అంటూ పూరి, రామ్ ప్రయోగం చేశారు. కానీ ఇది కూడా బెడిసి కొట్టేసింది.రూ.54 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన డబుల్‌ ఇస్మార్ట్‌ మూవీ కేవలం రూ.12 కోట్ల తో సరి పెట్టుకుంది. ఇప్పటికే లైగర్‌ నష్టాల నుం తేరుకోలేక పోతున్న పూరి జగన్నాధ్‌, డబుల్‌ ఇస్మార్ట్‌ నష్టాల నుంచి ఎలా బయట పడుతాడో చూడాలి.

Share