Current Date: 04 Jul, 2024

సీఎం జగన్‌కు పద్మశ్రీ అవార్డు ఇవ్వాల్సిందే..

సీఎం జగన్‌కు పద్మశ్రీ అవార్డు ఇవ్వాల్సిందే..
అది అక్రమమో, సక్రమమో ఏదైనా డబ్బు సంపాదించే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తరువాతే ఎవరైనా అని మాజీ ఎంపీ చింతామోహన్‌ అన్నారు. ఈ విషయంలో మా స్నేహితుడు రాజశేఖరరెడ్డి కుమారుడు జగన్‌కు పద్మశ్రీ, పద్మభూషణ్‌ అవార్డు ఇవ్వాల్సిందేనని ఎద్దేవా చేశారు. ఏమి చేసి సంపాదించాడో, ఎలా సంపాదించాడో తనకైతే తెలియదు గాని మొత్తానికి వేల, లక్షల కోట్లు సంపాదించాడన్నారు. అంతేనా.. ఎన్నికల్లో ఎలాగైలా గెలవాలనే తాపత్రయంతో ఆ అవినీతి డబ్బును యథేచ్ఛగా ఖర్చు చేశాడన్నారు. అయితే జగన్‌ ఆశించిన ఫలితం వచ్చే అవకాశం కనిపించడం లేదని చింతా మోహన్‌ వ్యాఖ్యనించారు.