Current Date: 06 Oct, 2024

తెలంగాణలో మహిళలకి మరో స్కీమ్.. మూడో స్టేట్‌గా రికార్డ్!

తెలంగాణలోని మహిళలకు రేవంత్ రెడ్డి సర్కార్ మరో గుడ్ న్యూస్ వినిపించింది. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకమే కాకుండా 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇప్పుడు మరో కొత్త పథకాన్ని అమలు చేసేందుకు కసరత్తు చేస్తోంది.రాష్ట్రంలో "మహిళా శక్తి- క్యాంటీన్ సర్వీస్"ల ఏర్పాటుకు సీఎస్ శాంతి కుమారి గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలో "మహిళా శక్తి- క్యాంటీన్ సర్వీస్"లను ఏర్పాటు చేస్తున్నట్టు సీఎస్ శాంతి కుమారి వెల్లడించారు. మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయాలన్న సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు అన్ని ప్రధాన కార్యాలయాలు, కలెక్టరేట్లు, పర్యాటక ప్రాంతాలు, దేవాలయాలు, బస్ స్టాండ్‌లు, పారిశ్రామిక ప్రాంతాల్లో మహిళా సంఘాల నిర్వహణలో ప్రత్యేకంగా క్యాంటీన్‎లను ఏర్పాటు చేస్తున్నామని సీఎస్ శాంతి కుమారి తెలిపారు.

Share