Current Date: 06 Oct, 2024

క్రికెట్‌లోకి అడుగుపెట్టిన ద్రవిడ్ కొడుకు.ఫస్ట్ మ్యాచ్‌లో ఫెయిల్

మాజీ క్రికెటర్ రాహుల్‌ ద్రవిడ్‌ తనయుడు సమిత్‌ ద్రవిడ్‌.. తండ్రి అడుగుజాడల్లోనే నడుస్తున్నాడు. ప్రస్తుతం కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ నిర్వహిస్తున్న మహారాజా ట్రోఫీ టీ20 లీగ్‌లోకి అతడు అడుగుపెట్టాడు.టోర్నీలో భాగంగా జరిగిన మ్యాచ్‌లో శివమొగ్గ, మైసూర్‌ వారియర్స్‌ జట్లు తలపడ్డాయి. సమిత్ ఆడుతున్న మైసూర్‌ తొలుత బ్యాటింగ్ చేయగా.. అతడు నాలుగో నెంబర్‌లో బ్యాటింగ్‌లోకి వచ్చాడు. బ్యాటింగ్‌ ఆల్‌ రౌండర్‌ అయిన సమిత్.. 9 బంతుల్లో ఒక బౌండరీతో సహా 7 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌ చేరాడు. భారీ షాట్‌ ఆడేందుకు ప్రయత్నించి స్పిన్నర్ హార్దిక్ రాజ్ బౌలింగ్‌లో ఔట్‌ అయ్యాడు.ఈ మ్యాచ్‌లో ఆశించిన మేర ప్రదర్శన చేయనప్పటికీ కర్ణాటక తరపున తన తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ జూనియర్‌ ద్రవిడ్‌ డెబ్యూ చేశాడు. దీంతో ద్రవిడ్‌ ఫ్యాన్స్‌ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్‌తో కచ్చితంగా రాణిస్తాడని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Share