Current Date: 05 Oct, 2024

తాడేపల్లిలో జాతీయ జెండా ఎగురవేసిన జగన్

తాడేపల్లిలోని  వైసీపీ  కేంద్ర కార్యాలయంలో 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ అధ్యక్షుడు జగన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జాతీయ నేతల చిత్రపటాలకు ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వాతంత్య్రo  కోసం పోరాడిన యోధులందరికీ మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నాను అంటూ జగన్ ట్వీట్ చేశారు. ఈ కార్యక్రమం లో   శాసనమండలి ప్రతిపక్ష నేత లేళ్ల అప్పిరెడ్డి గారు, మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ గారు, అంబటి రాంబాబు గారు, విడదల రజని గారు, కారుమూరి నాగేశ్వరరావు గారు, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి  వైసీపీ నేతలు పాల్గొన్నారు

Share