Current Date: 23 Sep, 2024

పెళ్లిలో చిత్రమైన అగ్రిమెంట్‌పై భార్య సంతకం.. వరుడు ఖుష్!

వివాహం అయిన తర్వాత భర్తకి భార్య పూర్తి స్వేచ్ఛని ఇవ్వదనే అపవాదు దశాబ్దాలుగా వస్తోంది. కొంత మంది భర్తలు తన ఫ్రెండ్స్‌తో భార్య కలవనివ్వదు, వారితో కలిసి బయటికి వెళ్లనివ్వదు అంటూ ఒక గయ్యాళిగా ట్రీట్ చేస్తుంటారు. కానీ.. తమిళనాడులోని మైలాడుదురై జిల్లాలో ఓ భార్య తన భర్తకి పూర్తి స్వేచ్ఛనిస్తానని ప్రమాణం చేసింది. అంతేకాదు ఆ విషయాన్ని రూ.100 స్టాంప్‌ పేపర్‌పై రాసిచ్చి మరీ సంతకం చేసింది.మైలాడుదురై జిల్లాకి చెందిన ముత్తు కుమార్‌కు కురింజిపాడికి చెందిన పవిత్రతో తాజాగా వివాహమైంది. ఈ వివాహ వేడుకలో పాల్గొన్న ముత్తుకుమార్‌ స్నేహితులు  వివాహం తర్వాత అతను తమను కలవడేమోనని బాధపడ్డారు. ఇందుకు పరిష్కారంగా రూ.100 స్టాంప్‌ పేపర్‌ తీసుకొచ్చి అందులో.. పెళ్లయిన తరువాత స్నేహితులతో ఆనందంగా గడపడానికి అనుమతిస్తానని, వారితో విహారయాత్రలకు వెళ్లకుండా అడ్డుకోనని భార్య చెబుతున్నట్లు రాశారు.వివాహ వేదిక వద్దే వధువుకు ఆ స్టాంప్‌ పేపర్‌ను వివరించి సంతకం పెట్టించుకున్నారు. ఆమె కూడా ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా సంతోషంగా సంతకం చేసింది. ఇప్పుడుఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Share