Current Date: 07 Oct, 2024

చంద్రబాబు, జగన్‌ల షెడ్యూల్‌పై ఏపీలో ఇంట్రస్టింగ్ చర్చ

ఏపీలో ఇవాళ ఇంట్రస్టింగ్ టాపిక్ ఒకటి వైరల్ అవుతోంది. ఏపీ సీఎం చంద్రబాబు, వైసీపీ అధినేత జగన్‌ల షెడ్యూల్ ఆసక్తికర చర్చకు దారి తీస్తోంది. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ ప్రధాని మోదీతో భేటీ అవుతుంటే.. జగన్మోహన్ రెడ్డి హత్యాయత్నం కేసులో నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న పిన్నెల్లిని పరామర్శించేందుకు మాజీ సీఎం జగన్ వెళ్లనున్నారు. అమరావతి, పోలవరం, ఆర్థిక పరిస్థితిపై ప్రధానితో చంద్రబాబు మాట్లాడనున్నారు. సీఐ, టీడీపీ ఏజెంట్లపై దాడి, ఈవీఎం ధ్వంసం కేసులో అరెస్ట్ చేసి జైల్లో ఉన్న ఒక నిందితుడితో మాట్లాడేందుకు జగన్ వెళుతున్నారు. పోలింగ్ రోజు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేసిన సీసీటీవీ ఫుటేజ్ చూసి సుప్రీంకోర్టు ఆశ్చర్యపోయింది.

Share