Current Date: 06 Oct, 2024

ఆర్కే రోజా అతితెలివి ట్వీట్ఆడేసుకుంటున్న నెటిజన్లు

మాజీ మంత్రి రోజా అతితెలివి ప్రదర్శించి అడ్డంగా బుక్కైయ్యారు. 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై తొలిసారి స్పందించిన రోజా.. నగరిలో తన ఓటమి, రాష్ట్రంలో వైసీపీ పరాజయంపై ట్వీట్ చేశారు. చెడు చేసి ఓడిపోతే సిగ్గుపడాలి కానీ.. మంచి చేసి ఓడిపోయాం. గౌరవంగా తలెత్తుకు తిరుగుదాం.. ప్రజల గొంతుకై ప్రతిధ్వనిద్దాం అంటూ ట్వీట్ చేశారు.కానీ.. ఇక్కడే రోజా అతి తెలివి ప్రదర్శించారు. ఆ ట్వీట్‌‌కి ఎవరూ రెస్పాండ్ అవకుండా కామెంట్స్ సెక్షన్‌ని ఆఫ్ చేసుకుంది. దాంతో కామెంట్స్‌కి రోజా భయపడే ఇలా చేసిందని నెటిజన్లు ట్రోల్స్ మొదలెట్టారు. ఎన్నికలకు ముందు నుంచే నగరిలో రోజా ఓడిపోతారంటూ ప్రచారం జరిగింది. వైసీపీ ఓడిపోయే మొదటి సీటు నగరేనంటూ చాలా మంది వ్యాఖ్యలు చేశారు. అలాగే పలు సర్వేలు కూడా నగరిలో రోజా ఓటమి ఖాయమంటూ అంచనా వేశాయి..

Share