Current Date: 23 Sep, 2024

అంబులెన్స్ టైర్ పంక్షర్‌ కావడంతో అడ్డంగా దొరికిన స్మగ్లర్లు

టాలీవుడ్ మూవీ పుష్పలో చూపించినట్లుగా చాలా తెలివిగా అక్రమ మార్గంలో గంజాయిని రవాణా చేస్తూ తెలంగాణలో పట్టుబడ్డారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలో కోట్ల రూపాయల విలువచేసే గంజాయి పట్టుబడింది. అంబులెన్స్‌లో ఒడిశా నుంచి తమిళనాడుకు గంజాయి తరలిస్తుండగా అనుకోని రీతిలో స్మగ్లర్లు పట్టుబడ్డారు.మార్గమధ్యలో అంబులెన్స్ టైర్ పంక్చర్ కావంటతో కొందరు స్థానిక యువకులు సాయం చేసేందుకు ముందుకొచ్చారు. టైర్ మార్చే క్రమంలో ఓ యువకుడు అంబులెన్స్ డోర్ ఓపెన్ చేసి చూశాడు. అందులో అనుమానస్పదంగా ప్యాకింగ్ చేసిన గంజాయి కనిపించింది. ఎక్కడికెళ్తున్నారని డ్రైవర్‌ను ప్రశ్నించగా.పొంతన లేని సమాధానం చెప్పాడు. దీంతో అనుమానం వ్యక్తం చేసిన స్థానిక యువకులు ఆలస్యం చేయకుండా వారిని మాటల్లో పెట్టి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.పోలీసులు చేరుకుని అంబులెన్స్‌ను చెక్ చేయగా  అందులో సుమారు 4 క్వింటాళ్ల గంజాయి ఉంది. దీంతో డ్రైవర్‌తో పాటుగా మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

Share