Current Date: 06 Oct, 2024

ముగ్గురు ఐఏఎస్‌ అధికారుల బదిలీ

సీఎంవోలో విధులు నిర్వహిస్తున్న ముగ్గురు ఐఏఎస్‌ అధికారులు బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌ ఆదేశాలు జారీ చేశారు. పూనం మాలకొండయ్య, రేవు ముత్యాలరాజు, నారాయణ భరత్‌ గుప్తా ఈ ముగ్గురు ఐఏఎస్‌ అధికారులు జీఏడీకి రిపోర్టు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.   మరో వైపు నూతన సీఎస్‌గా నియమితులైన నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌ సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో బాధ్యతలు చేపట్టారు.