Current Date: 07 Oct, 2024

పనులు చేయకుండానే రూ.కోటిన్నర మింగేశారు!

ఏజెన్సీలోని గిరిజనులకు అడుగడుగున్నా అన్యాయమే జరుగుతోంది. ఓ వైపు మౌలిక వసతులు లేక నానా ఇక్కట్లు పడుతున్నారు. కనీస సౌకర్యాల కోసం నిత్యం అధికార యంత్రాంగాన్ని ప్రాధేయపడుతున్నారు. ఇదిలా ఉంటే పనులేమీ చేయకుండానే ఇక్కడ అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కయి రూ.140కోట్లు బిల్లులు డ్రా చేసేసుకున్నారు. ఆ తర్వాత అధికారులు బదిలీపై వెళ్లిపోవడంతో నిధులు మంజూరై నాలుగేళ్లవుతున్నా ఈ ప్రాంతంలో రోడ్డు పనులు ప్రారంభించలేదు. దీంతో చిర్రెత్తి 11గ్రామాల గిరిజనులు గురువారం డోలీ మోతలతో హోరెత్తిస్తూ ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయిస్తూ ఇకనైనా పనులు ప్రారంభించాలంటూ డిమాండ్‌ చేశారు. అల్లూరి జిల్లా అనంతగిరి మండలంలో పలు గ్రామాల యువత నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగింది.

Share