Current Date: 27 Sep, 2024

తిరుమల లడ్డూ వివాదం దేవాలయాలకు తెలంగాణ ప్రభుత్వం కీలక ఆదేశాలు

తిరుమల లడ్డూ తయారీలో ఉపయోగించిన నెయ్యిపై వివాదం నెలకొన్న తరుణంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇకపై రాష్ట్రంలోని దేవాలయాల్లో లడ్డూలు, ఇతర ప్రసాదాల తయారీకి ఉపయోగించే నెయ్యిని ప్రైవేటు సంస్థల నుంచి కాకుండా ప్రభుత్వ సంస్థ అయిన విజయ డెయిరీ నుంచే కొనుగోలు చేయాలని ఆదేశించింది. ఇకపై టెండర్లు పక్కనపెట్టి నేరుగా విజయ డెయిరీ నుంచే కొనుగోలు చేయాలని పేర్కొంది. ప్రభుత్వ ఆధ్వర్యంలోని విజయ డెయిరీ ఉత్పత్తి చేసే నెయ్యిని కాకుండా కమీషన్ల కోసం ప్రైవేటు సంస్థలవైపు చూడడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేసింది.

Share