Current Date: 05 Oct, 2024

నామినేటెడ్ పోస్టుల భర్తీకి చంద్రబాబు కసరత్తు పతాక స్థాయిలో పోటీ

ఆంధ్రప్రదేశ్‌లో నామినేటెడ్ పదవుల భర్తీకి రంగం సిద్ధమైంది. ఇప్పటికే అనధికారికంగా కొందరి పేర్లు బయటికి రావడంతో.. కూటమి నేతల నుంచి పదవుల కోసం పోటీ పెరిగిపోయింది. దాదాపు 23వేల మంది ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్నారు.నామినేటెడ్ పోస్టుల భర్తీపై ఇటీవల పవన్ కల్యాణ్, పురంధేశ్వరితో సీఎం చంద్రబాబు చర్చించారు. ఈ క్రమంలో ఎవరి మనసునీ నొప్పించకుండా దశల వారిగా పోస్టులను ప్రకటించాలని నిర్ణయించారు. అందులో భాగంగా ఎన్నికల్లో సీటు దక్కని టీడీపీ సీనియర్లకు కీలక పదవులు ఖరారైనట్లు తెలుస్తోంది.టీడీపీలో సీనియర్లతో పాటు జనసేన, బీజేపీ ముఖ్య నేతలకు రాష్ట్ర స్థాయి పదవులు దక్కనున్నాయి. మెగా బ్రదర్ నాగబాబుకు కూడా ఓ కీలక పదవి దక్కనుందని తెలుస్తోంది. టీవీ5 బీఆర్‌ నాయుడికి టీటీడీ ఛైర్మన్ పదవి ఇవ్వబోతున్నట్లు ఇప్పటికే జోరుగా ప్రచారం జరుగుతోంది.

Share