Current Date: 05 Oct, 2024

భార్య, కుమార్తె నుంచి ప్రాణహాని: దువ్వాడ

 వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తన భార్య వాణి, కుమార్తె హైందవి, వారి బంధువులపై టెక్కలి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బీఎసీఆర్ కాలేజీ ఎదురుగా ఉన్న తన ఇంటిపై దాడికి దిగారని, గేట్లు విరగ్గొట్టి తనపై హత్యాయత్నానికి పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని, తనకు రక్షణ కల్పించాలని పోలీసులను ఆయన కోరారు.

Share