Current Date: 04 Jul, 2024

విశాఖలో వైసీపీ ఖాళీ .. ఎమ్మెల్యే గణబాబు ట్వీట్‌

విశాఖలో నెల రోజుల వ్యవధిలో వైసీపీ ఖాళీ కానుందని పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు ట్విటర్‌ (ఎక్స్‌)లో సంచలనం రేపారు. టీడీపీ వారి అవసరం లేదని తేలిపోవడంతో ఇప్పుడు మిత్రపక్షాలైన జనసేన, బీజేపీ గూటికి చేరేందుకు క్యూ కడుతున్నారంటూ శనివారం పేర్కొన్నారు. అధికార దాహంతోనే వైసీపీ నేతలు ఇలా చేస్తున్నారని, కనీసం రెండేళ్లయినా ప్రతిపక్ష పాత్ర పోషించేందుకు సిద్ధంగా లేని వైసీపీ నేతల పట్ల మిత్ర పక్షాలు జాగ్రత్త వహించాలని గణబాబు సూచించారు. వారంతా పార్టీ మారినంత మాత్రాన టీడీపీ అధినేతపై విశాఖ ఎయిర్‌పోర్ట్‌ వద్ద దాడి చేసిన వారిని తాము మర్చిపోబోమని గణబాబు ఈ సందర్భంగా హెచ్చరించారు.