Current Date: 02 Jul, 2024

భారత క్రికెటర్ల మధ్య గొడవమధ్యలోకి సచిన్ కూతురు

టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నీకి రిజర్వు ప్లేయర్‌గా ఎంపికైన శుబ్‌మన్ గిల్, స్వదేశానికి వచ్చేస్తున్న విషయం తెలిసిందే. అయితే క్రమశిక్షణ తప్పి, ప్రవర్తించడం వల్లే శుబ్‌మన్ గిల్‌ని స్వదేశానికి టీమిండియా మేనేజ్‌మెంట్ పంపినట్లు తెలుస్తోంది.టోర్నీ కోసం యూఎస్‌ఏకి వెళ్లిన శుబ్‌మన్ గిల్, న్యూయార్క్‌లో వాలినప్పటి నుంచి టీమ్‌తో కలిసి ఉండడం లేదట. వేరే వ్యాపకాల్లో బిజీగా ఉంటూ కనీసం ప్రాక్టీస్ సెషన్స్‌కి కూడా రావడం లేదని తెలిసింది. దాంతో ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గొనాల్సిందిగా రోహిత్ శర్మ, రాహుల్ ద్రావిడ్ చెబితే.. మ్యాచులు ఆడని దానికి, ప్రాక్టీస్ చేయడం ఎందుకు అని సమాధానం ఇచ్చాడట.ఈ గొడవ కారణంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను సోషల్ మీడియాలో శుభమన్ గిల్ అన్ ఫాల్ చేశాడు. ఇక్కడే ఇంకో విషయం కూడా బయటకి వచ్చింది.. సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ కూడా ప్రస్తుతం యూఎస్ టూర్‌లోనే ఉంది. సారా టెండూల్కర్, శుబ్‌మన్ గిల్ డేటింగ్‌లో ఉన్నారని చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. యూఎస్‌ఏలో సారా టెండూల్కర్, ఆమె స్నేహితులతో కలిసి శుబ్‌మన్ గిల్ చక్కర్లు కొడుతూ షికార్లు కొడుతున్నాడని.. అందుకే ప్రాక్టీస్ సెషన్స్‌కి కూడా రావడం లేదని అంటున్నారు.

Share