Current Date: 05 Oct, 2024

తల్లిదండ్రులపై దాడిని చూసి.ఆగిన కుమార్తె గుండె

కళ్ల ముందే తల్లిదండ్రులపై ప్రత్యర్థులు విచక్షణ లేకుండా దాడి చేస్తుండటంతో ఆ కూతురి గుండె తట్టుకోలేక ఆగిపోయింది. ఈ విషాదకర ఘటన సూర్యాపేట జిల్లా నాగారం మండలంలోని డి.కొత్తపల్లిలో జరిగింది. కొత్తపల్లికి చెందిన కాసం సోమయ్యకు.. అదే గ్రామానికి చెందిన కడారి సోమయ్యకు మధ్య చాలాకాలంగా గొడవలు జరుగుతున్నాయి. వీళ్లిద్దరి మధ్య ఉన్న గొడవలపై చాలా సార్లు గ్రామంలో పంచాయితీలు కూడా పెట్టారు. ఈ క్రమంలోనే కాసం సోమయ్య సూర్యాపేటకు షిఫ్ట్ అయ్యాడు.ఇటీవల సోమయ్య కుమార్తె పావని(14) అనారోగ్యానికి గురికాగా ఆమెకు ఆపరేషన్ చేశారు. దీంతో.. నెల రోజుల కింద సోమయ్య కుటుంబం మళ్లీ తన సొంతూరుకు తిరిగొచ్చి అక్కడే ఉంటోంది. కాగా శ్రావణ మాసం నేపథ్యంలో గురువారం రోజున గ్రామంలో బోనాల పండుగ జరిగింది. పండుగ సందర్భంగా కడారి సైదులు, కాసం కాశిలింగం, కడారి సోమయ్య కలిసి మద్యం తాగారు. మద్యం తాగుతున్న సమయంలో కాసం సోమయ్యతో ఉన్న పాత కక్షలు చర్చకు రావటంతోముగ్గురు కలిసి అతని ఇంటికి వెళ్లి ఘర్షణకు దిగారు.కాసం సోమయ్య, అతని భార్య మంజులపై కర్రలతో విచక్షణారహితంగా దాడి చేశారు. 

Share