Current Date: 04 Jul, 2024

టీడీపీ ఫస్ట్ టార్గెట్ బొత్స.. ఎటూ తప్పించుకోకుండా లాక్!

ఏపీలో టీడీపీ వేట మొద‌లు పెట్టింది. అధికారంలోకి రాగానే వైసీపీ లొసుగులు వెతికే పనిలో ఉత్సాహం ప్రదర్శిస్తోంది. ఈ క్ర‌మంలో టీడీపీ మొద‌టి టార్గెట్ మాజీ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ అని తెలుస్తోంది. విద్యాశాఖ మంత్రిగా బొత్స స‌త్య‌నారాయ‌ణ తీవ్ర అవినీతికి పాల్ప‌డిన‌ట్టు టీడీపీ ఆరోపిస్తోంది. ఈ మేరకు ఏసీబీకి టీడీపీ సీనియ‌ర్ నేత వ‌ర్ల రామ‌య్య ఫిర్యాదు చేయ‌డం కూడా జరిగిపోయిందిఎన్నిక‌ల కోడ్ వ‌చ్చిన త‌ర్వాత టీచ‌ర్ల బ‌దిలీల్లో అక్ర‌మాల‌కు పాల్ప‌డ్డార‌నేది టీడీపీ ప్ర‌ధాన ఆరోప‌ణ‌. ఉపాధ్యాయుల అక్ర‌మ బ‌దిలీల కోసం ఒక్కొక్క‌రి నుంచి రూ.3 ల‌క్ష‌ల నుంచి రూ.6 ల‌క్ష‌ల వ‌ర‌కు బొత్స‌, ఆయ‌న పేషీలోని సిబ్బంది వ‌సూళ్లు చేశార‌ని ఆయ‌న ఆరోపించారు. ఇలా మొత్తం రూ.65 కోట్లు వ‌సూళ్లు చేసిన‌ట్టు ఆయ‌న అన్నారు.