Current Date: 06 Oct, 2024

ప్రొటోకాల్ డీ.. సీఎం చంద్రబాబు సీరియస్!పాటించని టీటీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు.. అనంతరం కుటుంబ సమేతంగా తిరుమలకు చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. కానీ.. కొండపై ప్రోటోకాల్ విషయంలో తితిదే అధికారులునిర్లక్ష్యంవ్యవహరించిసీఎంచంద్రబాబుకికోపంతెప్పించారు.ముఖ్యమంత్రికి స్వాగతం పలికేందుకు తితిదే ఇన్‌ఛార్జి ఈవో వీరబ్రహ్మం వాహనం వద్దకు రాలేదు. సీఎం చంద్రబాబుని అవమానపరిచేలా వ్యవహరించారు. నిజానికి గాయత్రి నిలయం వెలుపలే తితిదే ఇన్‌ఛార్జి ఈవో వీరబ్రహ్మం పుష్పగుచ్చం ఇచ్చి ప్రొటోకాల్ ప్రకారం స్వాగతం పలకాల్సి ఉంది. కానీ.. భవనం లోపలకు వెళ్లాక అప్పుడు హడావుడిగా సీఎంకి పుష్పగుచ్చం ఇవ్వడానికి ఈవో ప్రయత్నించారు.మూడు సార్లు సీఎంగా ఇప్పటికే పనిచేసిన చంద్రబాబుకి ప్రొటోకాల్ గురించి బాగా అవగాహన ఉంది. దాంతో అవమానంగా ఫీలైన చంద్రబాబు.. ఆ పుష్పగుచ్చంను తీసుకునేందుకు నిరాకరించారు.

Share