Current Date: 04 Jul, 2024

వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లికి ఊరట

ఈవీఎం ధ్వంసం కేసులో మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టులో ఊరట దక్కింది. జూన్ 5 వరకు ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది. తదుపరి విచారణను జూన్ 6కు వాయిదా వేసింది. పిన్నెల్లిపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఈసీని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. పిన్నెల్లి కోసం పోలీసులు గాలిస్తుండగానే ఆయన హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా.. కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది.