Current Date: 06 Jul, 2024

ఉత్తరప్రదేశ్‌లో తొక్కిసలాటకి అసలు కారణం వెలుగులోకి!


ఉత్తర ప్రదేశ్‌లోని హత్రాస్‌లో తొక్కిసలాట తీవ్ర విషాదం నింపింది. ఈ ఘటనలో ఇప్పటికే 116 మంది దుర్మరణం పాలవ్వగా.. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారిలో మరి కొంత మంది పరిస్థితి విషమంగా ఉంది. ఒక బాబా నిర్వహించిన కార్యక్రమానికి లక్షలాది మంది రావడం, పెను విషాదం చోటుచేసుకోవడం యావత్ దేశాన్ని ఉలిక్కిపాటుకు గురిచేసింది.ఈ భోలే బాబా ఎవరు? అని తెలుసుకునేందుకు గూగుల్‌లో అందరూ సెర్చ్ చేస్తున్నారు. అతడు తనకు తానుగా దైవాంశ సంభూతుడిగా ప్రకటించుకున్నాడు. అతడి అసలు పేరు సౌరభ్ కుమార్. గతంలో ఉత్తరప్రదేశ్ పోలీసు ఇంటెలిజెన్స్ బ్యూరోలో పనిచేసేవాడని ‘నవభారత్ టైమ్స్’ పేర్కొంది.17 సంవత్సరాలు ప్రభుత్వ ఉన్నతోద్యోగం చేసిన తర్వాత తన పదవికి స్వచ్ఛందంగా విరమణ చేశాడు. ఆ తర్వాత బాబా అవతారం ఎత్తాడు. అనతి కాలంలోనే వేల సంఖ్యలో భక్తులు అతడిని అనుసరించడం మొదలుపెట్టారు. స్వయం ప్రకటిత దేవుడిగా ప్రకటించుకున్న సౌరభ్ కుమార్.. ‘భోలే బాబా’గా క్రమంగా తన సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ వచ్చాడు.

Share