Current Date: 02 Apr, 2025

మళ్లీ నోరుజారిన నాగబాబు.. ట్వీట్‌పై రచ్చ రచ్చ

నాగబాబు సోషల్ మీడియాలో పోస్టు చేసిన ట్వీట్‌పై ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 సినిమా విడుదల కాబోతున్న తరుణంలో ‘‘నువ్వు అడ్డదారిలో వెళ్తున్నావని గ్రహిస్తే వెంటనే నీ దారి మార్చుకో. నువ్వెంత ఆలస్యం చేస్తే నీ మూలాల దగ్గరికి చేరుకోవడం అంత కష్టమవుతోంది’’ అని స్వామి వివేకానంద కొటేషన్‌ను పోస్టు చేశారు.ఈ ఏడాది మేలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా ఆయన ఇదే తరహాలో సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ‘‘మాతో ఉంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మావాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే’’ అని ఆయన అప్పట్లో చేసిన ట్వీట్ కూడా చర్చకు కారణమైంది. ఈ ట్వీట్ తర్వాత కొంతకాలం సోషల్ మీడియాకు నాగబాబు దూరంగా ఉన్నారు.ఎన్నికల సమయంలో నంద్యాల అసెంబ్లీ స్థానం నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్ధిగా బరిలోకి దిగిన శిల్పా రవి రెడ్డికి మద్దతుగా అల్లు అర్జున్ ప్రచారం చేశారు. పవన్ కళ్యాణ్ టీడీపీ కూటమిలో ఉన్నారు. కానీ, ఆ సమయంలో అల్లు అర్జున్ వైఎస్ఆర్ సీపీ అభ్యర్ధి తరపున ప్రచారం చేయడం చర్చకు దారి తీసింది. ఈ ఘటన కూడా అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ అభిమానులకు మధ్య గ్యాప్‌ను మరింత పెంచిందనే ప్రచారం కూడా ఉంది.

Share