Current Date: 05 Oct, 2024

సిఎస్ తో భేటీ అయిన భారత నావికాదళ వైస్ అడ్మిరల్ ఎవై సర్దేశాయి

భారత నావికాదళ ప్రధాన కేంద్రం న్యూఢిల్లీ వైస్ అడ్మిరల్ ఎవై సర్దేశాయి శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ను మర్యాద పూర్వకంగా కలిశారు.ఈసందర్భంగా ఇరువురు అధికారులు రాష్ట్రంలో నావికాదళ కార్యకలాపాలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.ఈకార్యక్రమంలో రియర్ అడ్మిరల్ గిరిష్ కె.గార్గ్(విఎస్ఎం),రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా పాల్గొన్నారు.

Share