Current Date: 05 Oct, 2024

తల్లి అంత్యక్రియలకి బాలిక బిక్షాటన చలించిపోయిన రేవంత్ రెడ్డి


నిర్మల్‌ జిల్లా తానూరు మండలం బేల్‌తరోడా గ్రామంలో తల్లి ఆత్మహత్యతో ఒంటరిగా మిగిలిపోయిన బాలిక దుర్గకు అన్ని విధాలా అండగా నిలుస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు.గ్రామానికి చెందిన ఒంటరి మహిళ మేర గంగామణి(36) శనివారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. అప్పటికే ఆమె భర్త చనిపోగా  తల్లి మృతితో ఆమె ఏకైక కుమార్తె దుర్గ(11) అనాథగా మిగిలింది. బంధువులు ఎవరూ లేకపోవడంతో తల్లి అంత్యక్రియలకు కూడా  డబ్బు లేకపోవడంతో దుర్గ భిక్షాటన చేసింది.బాలిక బిక్షాటన వార్త సీఎం దృష్టికి రావడంతో ఆయన వెంటనే స్పందించారు. బాలికకు విద్య, వైద్య, ఇతర అవసరాలకు అండగా నిలవాలని జిల్లా కలెక్టర్‌ అభిలాష అభినవ్‌ను ఆదేశించారు. ఈ మేరకు బాలికకు ఉచిత విద్య అందించేందుకు గురుకుల పాఠశాలలో చేర్చుతామని, వైద్య, ఇతర సమస్యలేమైనా ఉంటే వెంటనే పరిష్కరిస్తామని కలెక్టర్‌ తెలిపారు.

Share