Current Date: 05 Oct, 2024

ఏపీని అగ్రగామిగా నిలుపుతాం: సీఎం చంద్రబాబు

గత ఐదేళ్లలో దెబ్బతిన్న ఆంధ్రప్రదేశ్‌ బ్రాండ్‌ను తిరిగి పొందేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు   విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో నిర్వహించిన వేడుకల్లో మువ్వన్నెల జెండాను ఎగురవేశారు.  పోలీసుల నుంచి సీఎం గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ   ప్రజలకు ఉపయోగపడే విధానాలు రూపొందిస్తున్నాం. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా పాలనకు శ్రీకారం చుట్టాం. 100 రోజుల ప్రణాళిక టార్గెట్‌గా అన్ని శాఖల్లో సమీక్షలు చేస్తున్నామని చెప్పారు.    రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం నిర్దిష్ట నిర్ణయాలతో పాలన సాగించబోతున్నాం.    పోలవరాన్ని ముందుకు తీసుకెళ్తామని   సీఎం తెలిపారు

Share