Current Date: 05 Oct, 2024

దువ్వాడ.. ఇదేంది రగడ

సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఘోరంగా ఓడిరచినా వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ తీరు మారలేదు. సుమారు రెండేళ్ల కిందటి నుంచే శీనివాస్‌ ఆయన భార్య వాణి మధ్య  కలహాల కాపురం మొదలై వారిద్దరూ విడివిడిగా ఉండేంతవరకు వెళ్లింది. వీరి గొడవ రచ్చకెక్కడంతో ఎన్నికల ముందు దంపతులను ఇద్దరినీ పార్టీ అధినేత, అప్పటి సీఎం వైఎస్‌ జగన్‌ పిలిపించి మాట్లాడారు. టెక్కలి సీటు దువ్వాడ శ్రీనివాస్‌కు ఇస్తున్నానని, ఇద్దరూ కలిసిపనిచేయాలని నచ్చచెప్పి పంపించారు. అప్పట్లో గొడవ కాస్త సద్దుమణిగినా.. ఎన్నికల్లో ఘోర ఓటమి తరువాత  దువ్వాడ ఇంటి గుట్టు మళ్లీ వీధిన పడిరది. 

Share