Current Date: 04 Jul, 2024

భారీ విజయం అనంతరం తొలిసారి ఢిల్లీకి చంద్రబాబు, పవన్ కల్యాణ్...

టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. ఎన్నికల్లో భారీ విజయం తర్వాత తొలిసారి వారు ఢిల్లీకి వెళ్లనుండటం చర్చనీయాంశమైంది. మధ్యాహ్న 2గంటలకు ఢిల్లీకి చేరుకుని ఎన్టీయే సమావేశంలో పాల్గొనున్నారు. ఈ సమావేశానికి ప్రధాని మోదీ హాజరుకానున్నారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వ ఏర్పాటుకు చంద్రబాబు కీలకం కానున్న నేపథ్యంలో సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. బీజీపీ నూతన ప్రభుత్వ ఏర్పాటుకు చంద్రబాబు మద్దతు తెలపనున్నట్లు తెలుస్తోంది. సమావేశం అనంతరం సాయంత్రం 6గంటలకు వారి తిరిగి విజయవాడ రానున్నారు.