Current Date: 05 Oct, 2024

బొత్సా కి లైన్ క్లియర్ ఎమ్మెల్సీ ఎన్నికల నుంచి టీడీపీ ఔట్

ఎమ్మెల్సీ ఎన్నికల్లో బొత్సా సత్యనారాయణ (సత్తిబాబు ) కి లైన్ క్లియర్ అయినట్టే కనిపిస్తోంది. టీడీపీ తమ అభ్యర్థిని రంగంలోకి దించే యోచనను దాదాపు విరమించు కోవడం తో బొత్సా ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు మార్గం సుమగం అయ్యింది.ఎమ్మెల్సీ ఎన్నికల పట్ల టీడీపీ ముందస్తు ప్రణాళిక వేయడం లో ఘోరంగా విఫలమవడంతో ఈ పరిణామం ఏర్పడింది.విశాఖ జిల్లా టీడీపీ శాసనసభ్యుల్లో ఐక్యత లేకపోవడం తో  పోటీ విషయం లో ఉమ్మడి నిర్ణయం తీసుకోలేక పోయారు. దీనికి తోడు కొంత మంది టీడీపీ ఎమ్మెల్యే లతో బొత్సా కు సన్నిహిత సంబంధాలు ఉండడం వల్ల  వైసీపీ కి అనుకూల మయిన వాతావరణం ఏర్పడింది. పైగా వైసీపీ కి మెజారిటీ ఓట్లు ఉండనే వున్నాయి. టీడీపీ గెలవాలంటే అంత సులువు కాదు. అందువల్ల టీడీపీ ఎమ్మెల్యే లు నిర్లిప్తంగా వ్యవహారించారు.

Share