Current Date: 07 Oct, 2024

వైసీపీ నేత ఫిర్యాదుతో టీడీపీ ఎమ్మెల్యేపై కేసు

తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుపై కేసు నమోదైంది. నిర్మాణంలో ఉన్న ఇల్లు కూల్చివేత ఘటనలో వైసీపీ ఎంపీపీ నాగలక్ష్మి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు.మ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, టీడీపీ నాయకులు దౌర్జన్యంగా తన ఇల్లు ధ్వంసం చేశారని వైసీపీ ఎంపీపీ నాగలక్ష్మి తన ఫిర్యాదులో పేర్కొన్నారఈ నేపథ్యంలో కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. ఆ కూల్చివేత ఘటనలో వీడియోల ఆధారంగా ఇప్పటివరకు 68 మందిని పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది.కంభంపాడులో వైసీపీ ఎంపీపీ నాగలక్ష్మి భర్త చెన్నారావు తమ స్థలాలను ఆక్రమించి భవనం కడుతున్నారనికొంతమంది ముస్లిం మహిళలు కొలికపూడి దృష్టికి తీసుకవచ్చారు. దీంతో ఆదివారం అక్కడకు వచ్చి భవనాన్ని పరిశీలించిన కొలికపూడి.. ఆ భవనం అక్రమ నిర్మాణమని.. వాటిని తొలగిస్తామనిబాధితులకు హామీ ఇచ్చి
టీడీపీ, జనసేన కార్యకర్తలతో వెళ్లి ప్రొక్లెయిన్ సాయంతో భవనాన్ని పాక్షికంగా కూల్చివేశారు. ఆ తర్వాత అధికారులు నచ్చచెప్పడంతో రెండు గంటల హైడ్రామా తర్వాత ఎమ్మెల్యే అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Share