Current Date: 05 Oct, 2024

గురుపౌర్ణమి మహోత్సవంలో సీఎం చంద్రబాబు

మంగళగిరి సి.కె.కన్వెన్షన్‌ సెంటర్‌లో గురుపౌర్ణమి మహోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఆయన ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. సత్యం, ధర్మం, ధ్యానం ద్వారా జీవన గమ్యం ఏర్పరచుకోవాలని చెప్పారు. వేదవ్యాసుడి ఉపదేశాన్ని పాటించాలని, గురువుల పట్ల గౌరవంతో మెలగాలని సూచించారు.

Share