Current Date: 05 Oct, 2024

ఎమ్మెల్సీ గా బొత్స ఎన్నిక ఏకగ్రీవం

ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఉప ఎన్నిక  నేపథ్యంలో మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు విశాఖ జిల్లా జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ శుక్రవారం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. సంబంధిత ధ్రువీకరణ పత్రాన్ని కూడా బొత్స సత్యనారాయణకు అందజేశారు. ఈ సందర్బంగా బొత్స విశాఖలో మీడియాతో మాట్లాడుతూ ఈ రోజు చాలా మంచి రోజని, ఎమ్మెల్సీగా ఎన్నిక కావడం సంతోషOగా ఉందన్నారు. తనకు బీఫారం ఇచ్చిన వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ కు ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. తన విజయానికి సహకరించిన నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలన్నారు. తాను ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు సహకరించిన అన్ని రాజకీయ పార్టీలకు కూడా ధన్యవాదాలన్నారు.

Share