Current Date: 05 Oct, 2024

మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో ఏసీబీ సోదాలు

 మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో మంగళవారం ఉదయం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు సోదాలకు దిగారు. ఇబ్రహీంపట్నంలోని 15మంది అధికారుల బృందం తనిఖీలు చేపట్టింది. గతం వైసీపీ ప్రభుత్వ హయాంలో జోగి రమేష్ గృహ నిర్మాణ శాఖ మంత్రిత్వ బాధ్యతలు నిర్వహించారు. రమేష్ ఇంటిని స్వాధీనం చేసుకుని సోదాలు కొనసాగిస్తున్నారు. అగ్రిగోల్డ్ వ్యవహారంలో రమేష్ పై వచ్చిన ఆరోపణలపైనే ఏసీబీ విచారణ చేపట్టింది. పూర్తి వివరాలు అధికారికంగా తెలియాల్సి ఉంది.

Share