Current Date: 05 Oct, 2024

నిద్రిస్తున్న కుటుంబంపై కూలిన ఇంటి స్లాబ్ తృటిలో తప్పిన ప్రాణాపాయం

రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఓ ఇంటి స్లాబ్ నానిపోయి నిద్రిస్తున్న కుటుంబంపై కూలిపోయింది. ఈ సంఘటనలో ఆ కుటుంబ సభ్యులు స్వల్ప గాయాలతో తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. కంచరపాలెం పరిధిలోని 47వ వార్డు, కప్పరాడ  కొండ సమీపంలోని  అరుంధతి నగర్‌లో ఓ ఇంట్లో  దేవి, ఆమె భర్త, ఇద్దరు పిల్లలు ఉంటున్నారు. కుండపోత వర్షాలకు  ఆ ఇంటి  పై భాగం (స్లాబ్ ) నాని పోయి  ఫ్యాన్ తో పాటు శనివారం రాత్రి కూలి  మంచంపై నిద్రలో ఉన్న దేవి పిల్లలపై పడిపోయింది. ఈ సంఘటనలో ఇద్దరు పిల్లలకు కాళ్లు, చేతులకు  గాయాలై  ప్రాణాపాయం నుండి తప్పించుకున్నారు.  విషయం తెలిసిన స్థానిక  బీ.జే.పీ వార్డు ప్రధాన కార్యదర్శి బాత భాను, బీ.జే.వై.ఎం నాయకులు గునుపూడి అరుణ్ బాబు  అక్కడికి చేరుకొని, జరిగిన విషయాన్ని సంబంధిత ఉన్నత అధికారులకు తెలియజేశారు. దేవి కుటుంబానికి నష్టపరిహారం అందేలా స్థానిక ఎమ్మెల్యే  ఎం.ఎల్.ఎ విష్ణు కుమార్ రాజు దృష్టికి తీసుకు వెళ్తామని వారు బాధితులకు హామీ ఇచ్చారు.

Share