Current Date: 05 Oct, 2024

సింహాచలం శ్రీ వారాహ లక్ష్మి నృసింహ స్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జే కె మహేశ్వరి

సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి కుటుంబ సమేతంగా విశాఖ నగరంలోని సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారిని ఈరోజు దర్శించుకున్నారు. వీరికి ఆలయ కార్యనిర్వహణాధికారి ఎస్. శ్రీనివాసమూర్తి, అర్చ క బృందం, వేద పండితులు నాదస్వర వేద మంత్రాలతో స్వాగతం పలికారు. ముం దుగా కప్ప స్తంభం ఆలింగనం గావించి, తదుపరి బేడా మండపంలో ప్రదక్షిణ చేయిం చారు. అనంతరం స్వామి వారి ఆలయంలో గోత్ర నామాలతో పూజలు చేయించి, తదనంతరం వేద పండితులచే వేద ఆశీర్వచనం పలికారు. ఈ సందర్బంగా స్వామి వారి చిత్రపటాన్ని, తీర్ధ ప్రసాదాలను న్యాయమూర్తి మహేశ్వరికి ఆలయ కార్య నిర్వ హణాధికారి ఎం. శ్రీనివాసమూర్తి బహూకరించారు. వీరితో విశాఖపట్నం జిల్లా న్యాయమూర్తి ఆలపాటి గిరిధర్, ప్రోటోకాల్ న్యాయమూర్తులు, కోర్టు సిబ్బంది, జీవీఎంసీ, రెవెన్యూ, పోలీస్ తదితర శాఖల అధికారులు ఉన్నారు. 

Share