Current Date: 04 Jul, 2024

జవహర్‌రెడ్డి జంప్‌

అమరావతి, న్యూస్‌లీడర్‌, జూన్‌ 6 : ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌ రెడ్డి సెలవుపై వెళ్లిపోయారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవ వేదికపై సీఎస్‌ హోదాలో జవహర్‌ రెడ్డి కనిపించడానికి వీలు లేదని ఆదేశాలు వెళ్లినట్టు తెలిసింది. ఈ క్రమంలో జవహర్‌ను సెలవుపై వెళ్లిపొమ్మని గవర్నర్‌ కార్యాలయం నుంచి ఆదేశాలు వెళ్లాయి. ప్రమాణ స్వీకారోత్సవంలో ప్రధాన కార్యదర్శి, ప్రమాణ పత్రం చదువుతుంటే గవర్నర్‌ ప్రమాణం చేయించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ నేపథ్యంలో జవహర్‌రెడ్డి ప్రమాణ పత్రం చదవాల్సి ఉంది. కానీ దీనికి చంద్రబాబు ససేమిరా అంగీకరించలేదు. ఈ విషయం గవర్నర్‌ దృష్టికి వెళ్లింది. వెంటనే సెలవుపై వెళ్లిపోవాల్సిందిగా జవహర్‌రెడ్డి ఆదేశాలు వెళ్లాయి. నిన్న మొన్నటి వరకూ జగన్‌ అండ చూసుకొని రెచ్చిపోయిన పలువురు సీనియర్‌ ఐఏఎస్‌, ఏపీఎస్‌ అధికారులపై కూడా చంద్రబాబు గుర్రుగా ఉన్నట్టు తెలిసింది.