మరికొన్ని గంటల్లో అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల జంట వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఈరోజు హైదరాబాదులోని అన్నపూర్ణ స్టూడియోస్లో చైతూ, శోభిత పెళ్లి జరగనుంది. ఈ వివాహ వేడుకకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక పెళ్లికి సినీ, రాజకీయ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు హాజరకానున్నారు. ప్రభాస్, దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, అల్లు అర్జున్ సహా పలువురు సినీ ప్రముఖులు ఈ వేడుకకు హాజరవుతారని సన్నిహిత వర్గాల సమాచారం. ఇదిలాఉంటే.. ఈ పెళ్లి సందర్భంగా ఇంటికి రాబోయే కోడలికి నాగార్జున ఖరీదైన బహుమతి ఇవ్వబోతున్నారని కుటుంబ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల నాగ్ రూ. 2 కోట్లు పెట్టి టయోటా లెక్సస్ కారును కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. దీనిని శోభితకు గిఫ్ట్గా ఇవ్వడానికే తీసుకున్నారని టాక్.