Current Date: 02 Apr, 2025

ఐపీఎల్ షెడ్యూల్‌లో ఆకస్మిక మార్పు

ఐపీఎల్ 2025 సీజన్ షెడ్యూల్‌లో మార్పు జరిగింది. చాలా రోజుల చర్చల తర్వాత, కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగే మ్యాచ్ షెడ్యూల్‌లో మార్పును భారత క్రికెట్ నియంత్రణ బోర్డు ఎట్టకేలకు ప్రకటించింది. అన్ని ఊహాగానాలు, పుకార్లు ఉన్నప్పటికీ, ఈ మ్యాచ్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో జరుగుతుందని ప్రకటించింది. ఇప్పుడు ఈ మ్యాచ్‌ తేదీలో మాత్రం మార్పు చేసింది. మార్చి 28 శుక్రవారం నాడు బీసీసీఐ ఒక పత్రికా ప్రకటనలో ఏప్రిల్ 6న జరగాల్సిన మ్యాచ్‌ను ఏప్రిల్ 8న నిర్వహిస్తామని ప్రకటించింది. ఐపీఎల్ 2025లో 19వ మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ ఏప్రిల్ 6న కోల్‌కతా హోం గ్రౌండ్ ఈడెన్ గార్డెన్స్‌లో జరగనుంది. కానీ, ఏప్రిల్ 6న రామనవమి వేడుకలను దృష్టిలో ఉంచుకుని, ఈ మ్యాచ్ షెడ్యూల్‌ను మార్చాలని కోల్‌కతా పోలీసులు బీసీసీఐని కోరారు. నగరంలో జరగనున్న ఈ ఉత్సవానికి భద్రతా ఏర్పాట్లను పేర్కొంటూ కోల్‌కతా పోలీసులు ఈ మార్పును కోరారు.

Share