Current Date: 07 Oct, 2024

పిఠాపురంలో స్థలం కొన్న పవన్ కళ్యాణ్.. ధర ఎంతంటే...

ఏపీ డిప్యూటీ సీఎం   పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఇల్లు కట్టుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారు. బుధవారం స్థలం కొని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. పిఠాపురం మండలంలోని భోగాపురం, ఇల్లింద్రాడ రెవెన్యూ పరిధిలో 1.44 ఎకరాలు, 2.08 ఎకరాలు రెండు బిట్లు తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ పేరున రిజిస్ట్రేషన్ కూడా పూర్తయ్యింది. ఇందులో రెండు ఎకరాల స్థలంలో క్యాంపు ఆఫీసు, మిగిలిన స్థలంలో ఇల్లు కట్టుకొని పిఠాపురం వాస్తవ్యుడిగా ఉంటానని బహిరంగ సభలో ప్రజలకు చెప్పారు. ఈ ప్రాంతంలో ఎకరం మార్కెట్ విలువ 15 నుంచి 16 లక్షల మేర ఉంది. మరో పదెకరాల తోటలు జనసేన నాయకులు కొనేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

Share