Current Date: 27 Sep, 2024

ఎయిర్ ఇండియాలో రూ.932కే విమాన టికెట్

టాటా గ్రూప్‌ చేతుల్లోకి వెళ్లిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ వచ్చే సంవత్సరం నుంచి తమ విమానాల్లో బిజినెస్‌ క్లాస్‌ సీట్లను ఎత్తివేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించగా.. తాజాగా  ‘ఫ్లాష్ సేల్’ని ప్రారంభించింది. రూ.932కే విమాన టికెట్‌ అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ప్రకటించింది. సెప్టెంబర్ 16, 2024లోపు బుక్‌ చేసుకున్న వారికే ఈ ఆఫర​్‌ అందుబాటులో ఉంటుందని, మార్చి 31, 2025 వరకు చేసే ప్రయాణాలకు ఇది వర్తిస్తుందని తెలిపింది. రూ.932తో ప్రారంభమయ్యే బేస్ ఛార్జీలతో పాటు, వివిధ మార్గాల్లో రూ.1,088 నుంచి టికెట్‌లను విక్రయిస్తోంది. తక్కువ ధరకు ఆఫర్‌ చేసే రూట్లలో ఢిల్లీ-గ్వాలియర్, గౌహతి-అగర్తలా, బెంగళూరు-చెన్నై, కొచ్చి-బెంగళూరు తదితరాలు ఉన్నాయి. airindiaexpress.com ద్వారా తమ టిక్కెట్‌లను బుక్ చేసుకునే కస్టమర్‌లు ప్రత్యేక రాయితీ కలిగిన ‘ఎక్స్‌క్లూజివ్ ఎక్స్‌ప్రెస్ లైట్’ ఛార్జీలను పొందవచ్చని పేర్కొంది. ఉచితంగా 3 కిలోల కేబిన్‌ బ్యాగేజీని ముందస్తుగా బుక్ చేసుకోవచ్చని చెప్పింది.

Share