Current Date: 02 Jul, 2024

అమెరికాపై గెలుపుతో సూపర్-8లోకి భారత్ఇప్పుడు పాకిస్థాన్ పరిస్థితి?

టీ20 వరల్డ్ కప్ 2024లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో అమెరికాపై గెలుపుతో భారత్ సూపర్-8 దశలోకి అడుగుపెట్టింది. న్యూయార్క్‌లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో గెలిచి గ్రాండ్‌గా నాకౌట్ దశలో స్థానం ఖరారైంది. గ్రూప్‌-ఏలో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 6 పాయింట్లతో సూపర్-8కు అర్హత సాధించింది. అయితే భారత్ గెలుపుతో దాయాది దేశం పాకిస్థాన్ సూపర్-8 సమీకరణాలు ఆసక్తికరంగా మారియి. పాకిస్థాన్ కూడా నాకౌట్ దశకు క్వాలిఫై కావాలంటే ఈ నెల 14న జరగనున్న అమెరికా-ఐర్లాండ్‌ మ్యాచ్ ఫలితం కీలకం కానుంది. 
 

Share