Current Date: 04 Jul, 2024

విదేశీ పర్యటన ముగించుకుని విజయవాడ చేరుకున్న ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌

గన్నవరం విమానాశ్రయంలో ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌కు ఘనస్వాగతం పలికిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు.విజయవాడ : విదేశీ పర్యటన ముగించుకుని కుటుంబసమేతంగా ముఖ్యమంత్రి వైయస్‌.జగన్ శనివారం విజయవాడ చేరుకున్నారు. ఈ సందర్భంగా గన్నవరం విమానాశ్రయంలో ముఖ్యమంత్రి  వైయస్‌.జగన్‌కు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులు, శ్రేణులు ఘనస్వాగతం పలికారు. అనంతరం విమానాశ్రయం నుంచి సీఎం వైయస్‌.జగన్ నేరుగా తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి చేరుకున్నారు.