Current Date: 05 Oct, 2024

విశాఖ అందాలు వర్ణనాతీతం

 విశాఖపట్నం అందాలు వర్ణనాతీతం అని సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ జె.కె. మహేశ్వరి అభిప్రాయపడ్డారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం ఉదయం కైలాసగిరి, తెలుగు మ్యూజియంను సందర్శించిన ఆయన అక్కడ అందాలను చూసి మంత్రముగ్దులయ్యారు. సెల్ఫి పాయింట్ వద్ద నిల్చొని సెల్ఫీ తీసుకున్న ఆయన కైలాసగిరి కొండపై నుంచి విశాఖ అందాలను తనివితీరా చూశారు. కుటుంబ సభ్యులందరితో కలిసి అద్దాల ట్రైన్లో ప్రయాణించి ఆనందపరవశం పొందారు. నాలుగు రోజుల విశాఖ పర్యటనలో ఎన్నో మధుర స్మృతులను పొందానని గుర్తు చేసుకున్నారు. ప్రకృతి సోయగాలకు, సహజసిద్ధమైన అందాలకు విశాఖపట్నం చిరునామాగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఆదివారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి ఆయన కైలాసగిరి, ఇతర ప్రాంతాల్లో పర్యటించారు. తెలుగు మ్యూజియంను సందర్శించి అక్కడి విశిష్ఠతలను స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు.

Share